భీమడోలు పంచాయతీ లో ఒక దళితుడి ఇంటి ప్రహరిని స్థానిక పంచాయతీ బుధవారం గృహ యజమానికి ముందుగా ఏవిధమైన నోటీస్ జారీ చేయకుండా కూల్చి వేశారని గృహ యజమాని కొత్తపల్లి చంద్ర మౌళి ఆరోపించారు. ఇటీవల కాలం లో భీమడోలు పంచాయతీలో కోటి రూపాయల కు పైగా పంచాయతీ నిధులు దుర్వినియోగమయ్యాయని ఆ నిధులు ఎలా దుర్వినియోగమయ్యాయో వివరిస్తూ కొత్తపల్లి చంద్రమౌళి జిల్లా అధికారులకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యం లో ప్రతి సోమవారం కలెక్టరేట్ లో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పిర్యాదు చేశాడు.
ఈ నిధుల దుర్వినియోగం పై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి ఆ నిధులను తిరిగి పంచాయతీకి జమ చేయించాలని తన పిర్యాదు లో చంద్రమౌళి జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయడమే చంద్రమౌళి కి శాపంగా మారింది. ఈ పిర్యాదు పై జిల్లా అధికారులు నియమించిన విచారణ కమిటీ పై నమ్మకం లేని చంద్రమౌళి లోకాయుక్త కోర్ట్ లో కూడా పిర్యాదు చేశాడు. ఈ పిర్యాదు పై భగ్గుమన్న భీమడోలు పంచాయతీ చంద్రమౌళి పంచాయతీ స్థలాన్ని కొద్దిగా ఆక్రమణలో ఉందనే నెపం చూపి, ప్రహరీ నిర్మాణం పంచాయతీ స్థలం లో ఉందని బుధవారం కక్షపూరితం గా కూల్చేశారని చంద్రమౌళి కుటుంబం ఆరోపించింది.
పంచాయతీ లో విధులు చేపట్టిన ఆరు నెలల లోపే ఒక ఉద్యోగి కోటి రూపాయలు పైగా అవినీతికి పాల్పడినట్టు చంద్రమౌళి కొన్ని రుజువులు తో కూడిన వివరాలు తన పిర్యాదు లో పేర్కొని అధికారులకు వివరించడం తో తన పై భీమడోలు పంచాయతీ కక్ష పూరితం గా వ్యవహరించి తన గృహం కూలిపోయే విధంగా తన ఇంటి ప్రహరిని కూల్చివేశారని చంద్ర మౌళి జిల్లా అధికారులకు సోషల్ మీడియా లో పిర్యాదు చేశాడు. నిబంధనలకు విరుద్ధం గా నకిలీ బిల్లుల తో పంచాయతీ నిధులు స్వాహా చేశారని పి జి ఆర్ ఎస్ లో కలెక్టర్ కి పిర్యాదు చేసినట్లు తెలిపారు.
కనీసం నీ గృహ నిర్మాణం పంచాయతీ స్థలాన్ని ఆక్రమించి నిర్మించావని పంచాయతీ రాజ్ చట్ట ప్రకారం ముందుగా తనకు పంచాయతీ నోటీస్ ఇవ్వాల్సి ఉండగా పంచాయతీ చట్టం ప్రకారం తనకు ముందుస్తు సమాచారం ఇవ్వకుండా కనీసం నోటీసు కూడా సర్వ్ చేయకుండా అప్పటికప్పుడే హడావుడిగా పంచాయతీ సిబ్బంది జే సి బి తో ను ట్రాక్టర్ తో ను వచ్చి తన కుటుంబ సభ్యులను భయ బ్రాంతులకు గురి చేసి తన ఇంటికి ప్రమాదం వాటిల్లే విధంగా తన ఇంటి ప్రహరిని కూల్చి వేస్తుంటే అడ్డుపడినందుకు తన పై పథకం ప్రకారం పంచాయతీ సిబ్బంది విధులకు ఆటంకం కల్పించానని తన పై అక్రమ పోలీస్ కేసు పెట్టారని ఆయన అన్నారు.
తన ఇల్లు కూలిపోయే విధంగా ఇంటి ప్రహరిని ఎటువంటి సమాచారం ఇవ్వకుండా బలవంతంగా కూల్చివేయడం దళితుల హక్కుల కు భంగం కలిగించినట్టు కాదా అని ప్రశ్నించారు. ఈ ఘటన దళితుల ను వేధించి అవమాన పరచినట్టు కాదా అని చంద్రమౌళి జిల్లా అధికారులను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. ఒక దళితుడు ననే చులకన భావం తో చట్టాన్ని ఉల్లంఘించి తనకు సమాచారం ఇవ్వకుండా తనపై పోలీస్ కేసు పెట్టీ ఒక దళితుడి ఇంటిని విద్వంసం చేయడం చట్ట సమ్మత మే నా పంచాయతీ రాజ్ చట్ట ప్రకారం పంచాయతీ స్థలం ఆక్రమించిన వ్యక్తికి కనీస సమాచారం ఇవ్వకుండా అధికారాన్ని అడ్డు పెట్టుకుని అహంకారం తో ప్రవర్తించారని తెలిపారు.
ఒక దళితుడు భార్యా బిడ్డలతో నివాసముంటున్న ఇల్లు కూలిపోయే విధంగా దళితుడి కుటుంబాన్ని కూల్చివేసిన ఈ ప్రమాదకరమైన ఘటనను కూడా జిల్లా కలెక్టర్,జిల్లా పోలీస్ అధికారులు పరిగణలోకి తీసుకుని తన ఇంటికి ప్రమాదం వాటిల్లెలా ప్రహరి కూల్చేసిన పంచాయతీ సిబ్బంది పై ఎస్ సి ఎస్ టి ఎట్రాసిటీ కేసు నమోదు చేసి పంచాయతీలో జరిగిన నిధుల స్వాహా నిగ్గు తేల్చాలని బాధితుడు చంద్రమౌళి జిల్లా అధికారులను కోరుతున్నాడు.
దీని పై సంబంధిత ఈ వో పి ఆర్ డీ ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా పోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. దీని పై భీమడోలు ఏం పి డి ఓ నీ వివరణ కోరగా అది నా పరిధి కాదు ఈ వో పి ఆర్ డీ ను వివరణ అడగండి అని సమాధానమిచ్చారు. భీమడోలు ఎస్ ఐ నీ వివరణ కోరగా చంద్రమౌళి పంచాయతీ సిబ్బంది విధులకు ఆటంకం కలిగిస్తున్నారని పిర్యాదు చేశారని పంచాయతీ చేసిన పిర్యాదుపై విధులు నిర్వహించామని చెప్పారు.