శ్రీకాకుళం జిల్లాలో దళితునిపై దాడి ఘటన దురదృష్టకరమని ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస పోలీస్ స్టేషన్ ఎదుట దళితునిపై సి ఐ దాడికి దిగడం బాధాకరమని ఆయన తెలిపారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు.
బాధ్యులైన సి ఐ ని వేణుగోపాల్ ను తక్షణమే సస్పెండ్ చేయాలని తగిన ఆదేశాలు ఇచ్చామని ఆయన వెల్లడించారు. ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశిస్తున్నామని, దళితుల రక్షణకు ఈ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఆయన అన్నారు.
ఘటనకు సంబంధించి విచారణ నిర్వహించి, ప్రాథమిక నివేదిక అందజేయాలని విశాఖ రేంజ్ డీఐజీ, శ్రీకాకుళం ఎస్పీలకు తగిన ఆదేశాలు ఇచ్చామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు.