దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ను అధికారం లోకి తెచ్చుకోవాలని, అప్పుడే అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి, ప్రజలకు కూడా రక్షణ కలుగుతుందని మాజీ.ఎం.పి. టీపీసీసీ ఉపాధ్యక్షులు డా.మల్లురవి అన్నారు.
303 లోకసభ సీట్లు వచ్చిన బీజేపీ ఇన్ని దాడులు చేస్తున్నదని, 400 సీట్లు వస్తే మనల్ని ఈ దేశం లో బతుకనిస్తారా అని ప్రశ్నించారు. దళితులకు మొదటి నుండి అండగా ఉన్నది కాంగ్రెస్ పార్టీయేనని ఆయన అన్నారు.
దళితులకు భూములు పంచింది, దళితులకు ఇండ్లు కట్టి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని ఆయన తెలిపారు. బీజేపీ అధికారం లోకి వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని, చట్టాలను నిర్వీర్యం చేస్తూ ఉంటే కాంగ్రెస్ చూస్తూ ఊరుకోదని ఆయన అన్నారు.
ఉత్తర్ ప్రదేశ్ లోని హత్రాస్ లో దళిత అమ్మాయి ని చంపిన వారిని కఠినంగా శిక్షించడానికి దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేస్తున్నదని ఆయన తెలిపారు.
ఒక వైపు రాజ్యాంగ రక్షణ కు పార్లమెంట్ లో కొట్లాడుతూ, రోడ్ల మీద దళితులకు రక్షణ గా దేశ వ్యాప్తంగా ఉద్యమం చేస్తున్న కాంగ్రెస్ కు దళితులు అండగా ఉండాలని ఆయన కోరారు.
దళితులకు మొదటి నుండి రక్షణ గా నిలబడుతుంది కాంగ్రెస్ అని చెబుతూ కాంగ్రెస్ పార్టీకి దళితులు అందరూ రక్షణ గా నిలబడాల్సిన సమయం వచ్చిందని మల్లు రవి అన్నారు.