27.7 C
Hyderabad
April 20, 2024 00: 04 AM
Slider రంగారెడ్డి

దళితుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి.. ఎంపీపీ

BJP Sha

దళితులు ఎదుర్కొంటున్నసమస్యలను పరిష్కరించి అర్హులైన వారికి వెంటనే మూడెక‌రాల భూమిని కేటాయించాలని బిజెపి సీనియర్ నాయకుడు, శామీర్ పెట్ మండల మాజీ ఎంపీపీ వంగరి హృదయ్ కుమార్ ప్రభుత్వాన్నిడిమాండ్ చేశారు. సోమవారం శామీర్పేట మండల కార్యాలయం వద్దగల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుల‌ర్పించారు. దళితులు ఎదుర్కొంటున్నసమస్యలపై తహసిల్దార్‌కు మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా హృదయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన విధంగా అర్హులైన లబ్ధిదారులందరికీ డబుల్ బెడ్ రూమ్ కేటాయించి పట్టాలను అందజేయాలని, నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగాలు కల్పించి వారి భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలని ప్రభుత్వాన్నిడిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో శామీర్పేట్ మండల అధ్యక్షుడు యాదగిరి, తూముకుంట మున్సిపాల్ అధ్యక్షుడు పట్నం నరసింహారెడ్డి, జిల్లా నాయకులు శివ, హైమా రెడ్డి, సునీత నాయక్, మండల నాయకులు భాస్కర్, మహంకాళి నర్సింగ్ రావు, యాదగిరి, జంగారెడ్డి, తుమ్మ వివేకానంద, నర్సింగరావు, రూప్ కుమార్, అశోక్, యాదగిరి, మండల నాయకులు పాల్గొన్నారు.

Related posts

మద్యం కుంభకోణం కేసులో ‘ఆప్‌’ పేరు..? ఈడీ కసరత్తు

Satyam NEWS

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కెసిఆర్ జన్మదిన వేడుకలు

Satyam NEWS

దేశంలో ఎక్కడ లేని విధంగా న్యాయవాదులకు ప్రభుత్వం హెల్త్ కార్డ్స్

Bhavani

Leave a Comment