ప్రయాణికులు పడే ఆందోళన ఇది. అసలే కుంగిపోయిన వంతెన… అంతేకాదు వంతెనకు రెండు ప్రక్కల రక్షణ లేని భయంకర ప్రయాణం. అదుపు తప్పితే అంతే సంగతులు….జరగరాని ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు?
ఈ పరిస్థితి అంతా పశ్చిమగోదావరిజిల్లా కామవరపుకోట మండలం కళ్లచెర్వు లింగపాలెం మండలం ఆసన్నగూడెం గ్రామాల మధ్య గుండేరు వాగుపై సుమారు వందేళ్లనాడు నిర్మించిన ప్రధాన వారధి దుస్థితి. ఆ వంతెన పట్ల అధికారుల కెందుకంత నిర్లక్ష్యం?
ఈ ప్రశ్న ఆ వంతెనపై ప్రయాణించే ప్రతి ఒక్కరిది. కానీ ఎవరికి వారు మనకెందుకు అనుకుని ఆ వంతెన దాటిపోతున్న పరిస్థితి. ఆ వంతెన పొడవునా రక్షణ గోడలు లేవు. కొంత మంది యువకులు కుంగిపోయి ప్రమాదకరంగా ఉన్న వంతెనపై ద్విచక్ర వాహనాలపై మితిమీరిన వేగంతో వెళుతున్నారు.
మద్యం సేవించో, ఆద మఱిచో వాహనం నడిపితే జరగబోయే ప్రమాదం పై ఆ వంతెనపై వెళ్లే ప్రయాణికుల్లో ఎంతమందికి అవగాహన ఉంటుంది? ఎందుకింత నిర్లక్ష్యం? ఈ వంతెనపై ఓవర్ లోడ్ లతో ట్రాక్టర్ లు లారీలు వంటి భారీ వాహనాలు, జె సి బి లు రాకపోకలు యథేచ్ఛగా జరుగుతున్నాయి.
ఇటువంటి ప్రమాదకర వంతెనకు ఇటువైపు గాని అటువైపు గాని ఎటువంటి హెచ్చరిక సూచనలు లేకపోవడం విశేషం.