తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం జూలై నెలకు సంబంధించిన రూ.300/- ప్రత్యేకప్రవేశ దర్శన టికెట్ల కోటాను జూన్ 29న సోమవారం టిటిడి ఆన్లైన్లో విడుదల చేయనుంది. రోజుకు 9 వేల టికెట్ల చొప్పున స్లాట్ల వారీగా అందుబాటులో ఉంచుతారు.
అదేవిధంగా, జూలై 1వ తేదీ నుండి రోజుకు 3 వేలు చొప్పున సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తారు. తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్లోని కౌంటర్ల ద్వారా భక్తులు ఒక రోజు ముందు ఈ టోకెన్లు పొందవచ్చు. జూలై 1న శ్రీవారి దర్శనానికి సంబంధించిన టోకెన్లను జూన్ 30న తిరుపతిలోని కౌంటర్లలో జారీ చేస్తారు.