అక్టోబర్ 16న ఎంగిలి పువ్వు బతకమ్మ, 24న సద్దుల బతకమ్మ నిర్వహించాలని తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ ధూప దీప నైవేద్య అర్చక సంఘం నిర్ణయించింది.
అదే విధంగా అక్టోబర్ 25న విజయదశమి, శమీపూజ నిర్వహించాలని కూడా నిర్ణయించినట్లు తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దౌలతాబాద్ వాసుదేవ శర్మ నిర్ణయించారు.
ఈ విషయాన్ని సూర్యాపేట జిల్లా ధూప దీప నైవేద్య అర్చక సంఘం అధ్యక్షుడు అన్నంబొట్ల ఫణి కుమార్ శర్మ తెలిపారు.
ఈ సందర్భంగా ఫణి కుమార్ శర్మ మాట్లాడుతూ విద్వాంసులు నిర్ణయించిన విధంగా ప్రజలందరూ బతుకమ్మ, విజయదశమి పండుగలను జరుపుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మంత్రమూర్తి ప్రసాద్ శర్మ, ఉపాధ్యక్షుడు రాయప్రోలు శ్రీరామయ్య శర్మ, ఉప్పల ఉదయ శర్మ, కోశాధికారి అరిపిరాల జనార్దన్ శర్మ, తదితరులు పాల్గొన్నారు.