దసరా సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రి పై జగన్మాత కనకదుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అంగరంగ వైభవంగా మేళతాళాలు నడుమ ఉత్సవమూర్తులను ఇంద్రకీలాద్రి దిగువున దుర్గాఘాట్ వరకు ఊరేగింపు నిర్వహించారు.
కృష్ణానదిలో వరద కొనసాగుతున్న నేపథ్యంలో హంస వాహనంపై ఉత్సవమూర్తుల నదీ విహారోత్సవం రద్దు చేశారు.
దుర్గాఘాట్లోనే హంస వాహనంపై అమ్మవారికి పూజలు నిర్వహించారు.
కనకదుర్గ పైవంతెనపై వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు.