దసరా పండుగ సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. విజయానికి చిహ్నం విజయదశమి అని,జిల్లా ప్రజలకు అన్ని విషయాలలో విజయాలు చేకూరాలని ఆయన ఆకాంక్షించారు.
నాగర్ కర్నూలు జిల్లాలో పుష్కలమైన నీటి వనరులు ఉన్నందున పాడిపంటలతో తులతూగాలని జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని కోరుతున్నామని ఆయన తెలిపారు.
జిల్లా ప్రజలు ఒకరినొకరు అన్ని పండుగలను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తున్నదని, తెలంగాణలో అతి పెద్ద పండుగ దసరా మిత్రులు కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకోవాలని ప్రజలందరికీ దుర్గ అమ్మవారు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నానని కలెక్టర్ పి ఉదయ్ కుమార్ పేర్కొన్నారు.