34.2 C
Hyderabad
April 23, 2024 12: 12 PM
Slider ముఖ్యంశాలు

హిందూ బంధువులకు “దసరా” శుభాకాంక్షలు…!

#Bandi Sainjai

హిందూ బంధువులకు దసరా..విజయదశమి శుభాకాంక్షలు అంటూ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ తెలిపారు.చెడు ఎంత బలమైనదైనా, ఎంతటి దుర్మార్గమైనదైనా చివరికి మంచే విజయం సాధిస్తుందని ఈ విజయ దశమి సూచిస్తుందన్నారు.

బీజేపీ నేతృత్వంలోని ఏన్డీఏ ప్రభుత్వం, ప్రధాని మోడీ దేశ ప్రజల ప్రయోజనాలను, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని 100(వంద) లక్షల కోట్లతో ప్రధాని గతిశక్తి అభివృద్ధి ప్రణాళికలకు రూపొందించారన్నారు. ప్రపంచంలోనే భారతదేశం అగ్రగామిగా, శక్తివంతమైన దేశంగా రూపొందాలన్న ఆకాంక్ష సంపూర్ణం కావాలని ఈ విజయదశమి విజయం చేకూర్చాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నారు.

కరోనా మహమ్మారి నుండి దేశ ప్రజలను కాపాడడానికి వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసి ప్రజల సహకారంతో త్వరలోనే వందకోట్ల మందికి అనుకున్న సమయానికి వ్యాక్సినేషన్ చేయించడంలో ప్రజల భాగస్వామ్యంతో ప్రధాని మోడీ విజయం సాధించారన్నారు.

అదేవిధంగా రాబోయే రోజుల్లో చిన్న పిల్లల కోసం వస్తున్న వ్యాక్సినేషన్ విజయం సాధిస్తుందన్న విశ్వాసం ఉందని కరోనా మహమ్మారి పూర్తిగా నిర్మూలన కావాలన్నారు.రాబోయే రోజుల్లో దేశ హితం కోసం దేశ సంక్షేమం కోసం ప్రధాని మోడీ  తీసుకుంటున్న నిర్ణయాలలో ప్రజలు భాగస్వాములు అవుతూ విజయం చేకూర్చాలని బండి సంజయ్ కుమార్ తెలిపారు.

శక్తికీ, సంకల్పానికి, విజయానికి ప్రతీక అయిన ఈ పర్వదినాన్ని ప్రజలు ఆనందోత్సహాలతో జరుపుకోవాలన్నారు. అందరికీ సకల శాంతి సౌభాగ్యాలు ప్రసాదించాలని అమ్మవారిని ప్రార్ధిస్తున్నాని తెలిపారు.

Related posts

కొత్త జిల్లాల ఏర్పాటుపై ఏపి ప్రభుత్వం కసరత్తు

Satyam NEWS

ఘనంగా చర్లపల్లి పాస్టర్ ఫెలోషిప్ క్రిస్మస్ సెలబ్రేషన్స్

Bhavani

రంజాన్ పండుగరోజు కూడా పరీక్ష నిర్వహించడమేమిటి?

Satyam NEWS

Leave a Comment