Slider తెలంగాణ

విద్యాసంస్థలకు దసరా సెలవులు పొడిగింపు

schools

బస్సులు వందకు వంద శాతం పునరుద్ధరించడానికి కొద్ది రోజులు పట్టే అవకాశం ఉండడంతో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు దసరా సెలవులను ఈ నెల 19 వరకు పొడిగిస్తున్నట్లు సిఎం ప్రకటించారు. ‘‘మూడు నాలుగు రోజుల్లోనే వందకు వంద శాతం ఆర్టీసీ బస్సులు నడుస్తాయి. అప్పటి వరకు విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల సెలవులను ఈ నెల 19 వరకు పొడిగిస్తున్నం. సిలబస్ నష్టపోకుండా భవిష్యత్తులో రెండో శనివారం విద్యా సంస్థలు నడపాలి. అవసరమైతే ఇతర సెలవులను తగ్గించుకోవాలి. 21వ తేదీ నుంచి అన్ని బస్సులు అందుబాటులోకి వస్తాయి. బస్ పాస్ విషయంలో ఒక్క విద్యార్థి కూడా బాధ పడొద్దు. కాబట్టి బస్ పాసులున్న విద్యార్థులు యధావిధిగా తమ విద్యాసంస్థలకు వెళ్లవచ్చు’’ అని సిఎం ప్రకటించారు.

Related posts

పత్రాలు తగులబెడితే చేసిన పాపాలు పోతాయా?!

Satyam NEWS

ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలి:కలెక్టర్ షేక్

Satyam NEWS

తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెంనాయుడుని కలిసిన మేడా విజయ్

Satyam NEWS

Leave a Comment