డైనమిక్ రిటైర్డ్ సీఐ దాసరి భూమయ్య టీఆర్ ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. పదవీ విరమణ తర్వాత కాంగ్రెస్ లో చేరిన ఆయన పీసీసీ అధికార ప్రతినిధిగా కొనసాగారు.
అనంతరం తీన్మార్ మల్లన్న టీమ్ రాష్ట్ర కన్వీనర్ గా వ్యవహరించారు. హుస్నాబాద్ ఎస్ ఐ గా, సీఐగా పనిచేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా తాను నమ్మిందే చేశేవాడు.
ఆయన పేరిట దాసరి భూమయ్య కాలనీ కూడా ఉంది. ఆయన పనిచేసిన రోజుల్లో ఎస్పీ నుంచి డీజీపీ వరకు అందరిని ప్రెస్ మీట్లు పెట్టి విమర్శించే వారు.
ప్రజాప్రతినిధుల మాట లెక్క చేయకపోవడం తో కొరకరని కొయ్యగా మారాడు. అనూహ్యంగా మంత్రి హరీష్ రావు సమక్షంలో టీఆర్ ఎస్ లో చేరారు.