వెంకటేశ్వరనగర్ షిరిడీ సాయిబాబా దేవాలయ సంస్థాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ దత్తాత్రేయ స్వామి జయంతి వేడుకలకు ముఖ్య అతిధులుగా మీర్ పేట హౌసింగ్ బోర్డు కాలనీ డివిజన్ కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ గుండారపు శ్రీనివాస్ రెడ్డి పాల్గొని ఉదయం కాగడ హారతి నిర్వహించి, శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి ప్రత్యేక అభిషేకం , గురు చరిత్ర పారాయణం చేశారు.అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంబించారు. ఈ సందర్భంగా సంస్థాన్ ట్రస్ట్ వారు దాదాపుగా 2000 మందకి పైగా భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షులు బేతి పాండు, సెక్రటరీ వసంతరావు, వీరభద్రరావు, శ్రీపతి, పివిజి.రాజారావు, నాదం చారి, తన్నీరు మాలద్రి, రమాదేవి, నాగయ్య, విఠల్, సురేష్ గౌడ్, భరత్ సింగ్, శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా