జుక్కల్ మండల సహకార సంఘం అధ్యక్ష ఎన్నికలలో గెలుపొందిన శివానంద్ మంగళవారం చైర్మన్ బాధ్యతలు స్వీకరించి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎన్డిసిసి బ్యాంకు చైర్మన్ భాస్కర్ రెడ్డి శాసన సభ్యులు హనుమంత్ సిండే ఈ మహోత్సవానికి హాజరయ్యారు. రైతుల అభ్యునతికి తనవంతు కృషిచేస్తానని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన చైర్మన్ అన్నారు.
కార్యక్రమంలో వైస్ చైర్మన్ గా గంగమణి ప్రమాణ స్వీకారం చేయగా, కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎడిసిసి బ్యాంక్ చైర్మన్ జుక్కల్ ఎమ్మెల్యేతో పాటు రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు అంజిరెడ్డి, ఎడిసిసి బ్యాంక్ సభ్యులు రామ్ పటేల్ సాయిరెడ్డి, జుక్కల్ ఎంపిపి యశోదా నీలు పటేల్ సర్పంచ్ రాములు సెట్, జడ్పీటిసి లక్ష్మీబాయి దాదారావు పటేల్ మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు సాయాగౌడ్ మాజీ జడ్పిటిసి మాధవరావుదేశాయి వైస్ఎంపిపి ఉమాకాంత్, బిచ్కుంద ఎంపిపి అశోక్ పటేల్, జుక్కల్ తెరాస అధ్యక్షులు బొల్లి గంగాధర్ ఆయా గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.