డెడ్ బాడీ కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు కొందరు. అదేమిటి అనుకుంటున్నారా? నిజంగానే జరిగింది ఈ సంఘటన. నంద్యాల ప్రభుత్వాసుపత్రి కి పోస్టు మార్టం చేసేందుకు ఒక ఆత్మహత్య కేసు వచ్చింది. డెడ్ బాడీ ని తీసుకువచ్చి అక్కడ ఉంచారు. ఇంతలో చనిపోయిన వ్యక్తి తాలూకు వారు వచ్చి అటూ ఇటూ చూసి ఎవరూ లేని సమయంలో ఆ డెడ్ బాడీని తీసుకుని ఉడాయించారు.
మృతుని బంధువులు చనిపోయిన వ్యక్తి బాడీకి పోస్ట్ మార్టం వద్దంటూ వెళ్లిపోవడం చూసి అక్కడ ఎవరికీ నోట మాటరాలేదు. పైగా డెడ్ బాడీని బైక్ పై పెట్టుకుని వారు పరారీ అయ్యారు. మృతదేహం తో పరారి అవుతున్న వారిని చూసి ఒక పోలీసు వెంటపడ్డారు అయితే వెంట పడ్డ పోలీసును తోసేసి డెడ్ బాడీని కిడ్నాప్ చేసేశారు.