34.2 C
Hyderabad
May 19, 2025 17: 07 PM
Slider ప్రత్యేకం

డబ్బులు జగన్ కి – జబ్బులు జనం కి

#jagan

5 ఏళ్ళ జగన్ పాలనలో, నాసిరకం జే-బ్రాండ్స్, పిచ్చి బ్రాండ్స్ తాగి, ఎంత మంది పిచ్చోళ్ళు అయిపోయారో అధికారిక లెక్కలు వెల్లడి అయ్యాయి. గత 5 ఏళ్ళ జగన్ పాలనలో, పేదలను నాసిరకం జే-బ్రాండ్స్ బలి తీసుకున్నాయి. 2019-2024 మధ్య ఆరోగ్యశ్రీ కింద చికిత్స తీసుకున్న వారి వివరాలు విశ్లేషణ చూస్తే, జగన్ జే-బ్రాండ్స్ తో జరిగిన మరణాల పై హత్య కేసులు కూడా నమోదు చేయల్సిన పరిస్థితి నెలకొంది. లిక్కర్ లో స్కాం చేసి జగన్ వేల కోట్లు వెనకేస్తే, జనాలకు జే బ్రాండ్స్ తాగి, లివర్, కిడ్నీలు, నరాలు దెబ్బ తిన్నాయి. ఇది 2019-2024 మధ్య ఆరోగ్యశ్రీ డేటా ఆధారంగా విశ్లేషణ చేస్తే, సంచలన విషయాలు బయటకు వచ్చాయి.

లివర్ సంబంధిత రోగాలు: 2019–2024 మధ్య → 200% పెరుగుదల

న్యూరాలజికల్ (మెదడు సంబంధిత) సమస్యలు: 2019–2024 మధ్య → 920% పెరుగుదల

కిడ్నీ సమస్యలు : 2019–2024 మధ్య → 84% పెరుగుదల

జే-బ్రాండ్స్ లో జగన్ ఏమి కలిపి ప్రజల్లోకి వదిలాడు ? అనేది ఇప్పటి ప్రశ్న. 2018-19 తో పోల్చుకుంటే, 2024 నాటికి లిక్కర్ వల్ల పిచ్చోళ్ళు అయిన వారి సంఖ్య 920% పెరిగింది.. డైరెక్ట్ గా నాడి వ్యవస్థ పై దెబ్బ పడి న్యూరాలజికల్ సమస్యలు వచ్చి, చాలా మంది పిచ్చోళ్ళు అయిపోయారు. జే-బ్రాండ్స్ తాగిన ప్రతి 10 మందిలో 5 మంది పిచ్చోళ్ళు అయ్యారు అంటే,జే-బ్రాండ్స్ ఎంత ప్రమాకరమో అర్ధం చేసుకోవచ్చు. ఇలాంటి వాళ్ళ పై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే, జే-బ్యాచ్ ఎందుకు గగ్గోలు పెడుతుంది ? లిక్కర్ లో స్కాం చేసి, ఇన్ని లక్షల మంది జీవితాలతో ఆడుకున్న జగన్ ని ఏమి చేయాలి ? ఈ ప్రశ్నలు ఇప్పుడు ఎంతోమంది అడుగుతున్నారు.

Related posts

విజ‌యీభ‌వ‌: ఒలింపిక్స్ బృందానికి విజయనగరం క‌లెక్ట‌ర్ శుభాకాంక్ష‌లు

Satyam NEWS

వనమాకు కోర్టులో నిరాశ

mamatha

ప్రజలలో పోలీస్ శాఖ గౌరవం పెరిగేలా పని చేయాలి

Satyam NEWS
error: Content is protected !!