27.7 C
Hyderabad
April 19, 2024 23: 12 PM
Slider ప్రత్యేకం

గొర్రెకుంట హత్యల కేసు దోషికి ఉరిశిక్ష

#GorrekuntaMurderCase

రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన వరంగల్ అర్బన్ జిల్లా గొర్రెకుంట హత్య కేసులో నిందితుడు సంజయ్ కుమార్ యాదవ్ కు శిక్ష ఖరారు అయింది.

తొమ్మిది మంది హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ వరంగల్ అదనపు సెషన్స్ కోర్టు నేడు తీర్పు చెప్పింది. ఈ ఏడాది మే 21న తొమ్మిది మందికి ఆహారంలో విషం కలిపి సంజయ్ సజీవంగానే బావిలో పడేశాడు.

ఆ తర్వాత సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీశారు. ఈ కేసుకు సంబంధించి 25 రోజుల్లోనే చార్జీషీట్ దాఖలు చేశారు.

మొత్తం 57మంది మంది వాంగ్మూలం నమోదు చేశారు. ఒక హత్యను కప్పిపుచ్చుకునేందుకు తొమ్మిది మందిని దారుణంగా హత్య చేసిన నిందితుడికి సంబంధించిన కోర్టు తీర్పుపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్నది.

Related posts

(Official) = Can Metamucil Lower Blood Sugar

Bhavani

దుబ్బాకలో ట్రబుల్ మేకర్లను బైండోవర్ చేయండి

Satyam NEWS

ఎయిడ్స్ పై ప్రజలు అందరూ అప్ర‌మ‌త్తంగా ఉండాలి

Satyam NEWS

Leave a Comment