32.7 C
Hyderabad
March 29, 2024 10: 13 AM
Slider పశ్చిమగోదావరి

తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో కరోనా మృత్యుహేల

#TDPleader

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రిలో గత మూడు రోజులుగా 20 మందికి పైగా మృత్యువాత కు గురయ్యారని తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇంచార్జ్ వలవల బాబ్జి తెలిపారు. వెంటిలేటర్ ఒక్కటే ఉన్నప్పటికి దానిని సరిగా ఆపరేట్ చేసే టెక్నీషియన్స్ లేరని ఆయన తెలిపారు. వెంటనే టెక్నీషియన్స్ ను తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వంద పడకల ఆస్పత్రికి కనీసం 30  వెంటిలేటర్లు ఉండటం సమంజసమే వాటిని వెంటనే వచ్చే విధంగా ఆరోగ్య శాఖ మంత్రి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఆస్పత్రి సిబ్బంది ఈ మరణాలను ప్రభుత్వానికి సత్వరమే తెలియజేసి మెరుగైన వైద్యం అందించేందుకు స్పందించాలని ఆయన కోరారు.

Related posts

ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి జూపల్లి

Satyam NEWS

విజయనగరం జిల్లాలో 2953 కుటుంబాల‌కు మ‌త్స్య‌కార భ‌రోసా

Satyam NEWS

కమ్మ, బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ కులాలను అణగదొక్కిన జగన్

Satyam NEWS

Leave a Comment