పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రిలో గత మూడు రోజులుగా 20 మందికి పైగా మృత్యువాత కు గురయ్యారని తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇంచార్జ్ వలవల బాబ్జి తెలిపారు. వెంటిలేటర్ ఒక్కటే ఉన్నప్పటికి దానిని సరిగా ఆపరేట్ చేసే టెక్నీషియన్స్ లేరని ఆయన తెలిపారు. వెంటనే టెక్నీషియన్స్ ను తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వంద పడకల ఆస్పత్రికి కనీసం 30 వెంటిలేటర్లు ఉండటం సమంజసమే వాటిని వెంటనే వచ్చే విధంగా ఆరోగ్య శాఖ మంత్రి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఆస్పత్రి సిబ్బంది ఈ మరణాలను ప్రభుత్వానికి సత్వరమే తెలియజేసి మెరుగైన వైద్యం అందించేందుకు స్పందించాలని ఆయన కోరారు.
previous post
next post