కేంద్రం ప్రతిపాదనలు తిరస్కరించిన రైతు సంఘాలు తమ తదుపరి కార్యచరణను ప్రకటించాయి. మూడు కొత్త చట్టాలను రద్దు చేయాలనేదే తమ ప్రధాన డిమాండ్ అని పేర్కొన్నాయి. ఆ చట్టాలు రద్దు చేసేవరకు దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతాయని రైతు సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు. డిసెంబర్ 12 వరకు దిల్లీ- జైపుర్ రహదారి దిగ్బంధం చేస్తామని రైతు సంఘాలు హెచ్చరించాయి. 12వ తేదీన దేశవ్యాప్తంగా టోల్ ప్లాజాల దిగ్బంధం, 12వ తేదీ తర్వాత భాజపా నేతలను ఘెరావ్, 14న దేశవ్యాప్త ఆందోళనలు చేపడతాంమని వ్యవసాయ చట్టాలు రద్దు చేసే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని ఇతర రాష్ట్రాల రైతులు కూడా దిల్లీలో ఆందోళనల్లో పాల్గొనాలని రైతు సంఘాలు కోరాయి.
previous post