34.2 C
Hyderabad
April 19, 2024 22: 50 PM
Slider మహబూబ్ నగర్

నాగ‌ర్ క‌ర్నూల్‌లో 8న ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటన

errolla srinivas

నాగర్ కర్నూలు జిల్లాలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ డా. ఎర్రోళ్ళ శ్రీనివాస్ అధ్యక్షతన ఈ నెల 8న‌ మంగళవారం ఉదయం 11 గంటలకు కల్వకుర్తి మండలం మార్చాల గ్రామంలోని ఎస్సీ కాలనీలో పర్యటించి, బల్మూరు మండలం కొండనాగుల గ్రామ పరిధిలోని గుడిబండ చెంచు కాలనీలో 5 గంటలకు కమిషన్ పర్యటించనున్నట్లు నాగర్ కర్నూల్ జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి అఖిలేష్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

జన అదాలత్” లో కోర్టు నిర్వహణ, ఎస్సీ, ఎస్టీ అభ్యున్నతి పరిరక్షణకై దళిత గిరిజన ఆవాసాల సందర్శన, అన్ని శాఖల మండల స్థాయి అధికారులతో సమీక్ష, ప్రజల నుంచి వినతులు స్వీకరణ ఉంటుందన్నారు.

సాయంత్రం 4 గంటలకు అచ్చంపేట ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో మీడియా ప్రతినిధులతో కమిటీ చైర్మన్ విలేఖ‌రుల స‌మావేశం నిర్వహించనున్నట్లు అఖిలేష్ రెడ్డి పేర్కొన్నారు.

ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ సభ్యుల పర్యటన సందర్భంలో ఆయా మండలాల అన్ని శాఖల అధికారులు కమిటీ ఆదేశాల మేరకు అందుబాటులో ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Related posts

ఎందుకో అంత హర్షం

Satyam NEWS

నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన వైసీపీ ఎమ్మెల్యే లు

Satyam NEWS

మానేరులో చిక్కుకున్న 19 మంది సేఫ్

Bhavani

Leave a Comment