సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండల కేంద్రం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని శ్రీనివాసపురం గ్రామంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి పోసన బోయిన హుస్సేన్ మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పేదలపై అనేక భారాలు మోపుతోందని ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు.
ప్రజలు కరోనాతో ఇబ్బందులు ఎదుర్కొంటుంటే మరోపక్క బిజెపి ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచి పేద మధ్య తరగతి ప్రజలు, కార్మికులు, రైతాంగాన్ని అనేక ఇబ్బందులకు గురి చేస్తుందని,ఏడు సంవత్సరాల కాలంలో బిజెపి ప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికి 15 లక్షల రూపాయలు ఇస్తామని పేద మధ్య తరగతి రైతాంగానికి మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన బిజెపి ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తుందని, దేశవ్యాప్తంగా సిపిఎం ఆధ్వర్యంలో ప్రజలను చైతన్యం చేస్తూ ప్రజా పోరాటాలు నిర్వహిస్తామని హుస్సేన్ ప్రభుత్వాన్ని విమర్శించారు.
పెంచిన పెట్రోల్,డీజిల్,గ్యాస్ ధరలను తగ్గించకపోతే ప్రజా పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం మండల కార్యదర్శి తంగెళ్ల చంద్ర, నూకల లక్ష్మీ నరసమ్మ,శైలజ,లక్ష్మీ, జానకమ్మ,మల్లమ్మ,శేషు,కుమారి, గోపరాజు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్