27.7 C
Hyderabad
April 25, 2024 10: 18 AM
Slider ముఖ్యంశాలు

పిల్లవాడ్ని చంపిన కిడ్నాపర్ ను ఉరి తియ్యాలి

#DeekshitReddy

మహబూబాబాద్ లో కిడ్నాప్ కు గురై ఆ తర్వాత హతుడైన పిల్లవాడు దీక్షిత్ రెడ్డి కుటుంబాన్నీ కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క నేడు పరామర్శించారు.

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నాలుగు రోజుల క్రితం దీక్షిత్ కిడ్నాప్ కు గురైన విషయం తెలిసిందే. దీక్షిత్ రెడ్డి కుటుంబాన్నీ పరామర్శిస్తూ ఎమ్మెల్యే సీతక్క కన్నీటిపర్యంతమయ్యారు.

ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ  పెట్రోల్ పోసి దారుణoగా చంపిన కిడ్నాపర్ సాగర్ తో పాటు సహకరించిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు.

ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీస్ లు అప్రమత్తం గా ఉండాలని అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు డాక్టర్ మురళి నాయక్, మండల అధ్యక్షులు మిట్టి గంటి రాం రెడ్డి,

మున్సి పల్ ఫ్లోర్ లీడర్ వెన్నం లక్ష్మ రెడ్డి,జన్న రెడ్డి మురళీధర్ రెడ్డి, స్థానిక కౌన్స్ లర్ మాజీ సర్పంచ్ శ్రీను, ఉప సర్పంచ్  వెంకన్న, గిరీష్, హేమంత్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

సీఎం పదవి కాదు, ముందు డిపాజిట్ తెచ్చుకోండి

Bhavani

మళ్లీ ముంచుకొస్తున్న మహమ్మారీ: భారీగా కరోనా కేసులు

Bhavani

ట్విట్టడం కాదు ముందు మన సంగతి ఏమిటో చూసుకుందాం

Satyam NEWS

Leave a Comment