నవంబర్ 4న దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్వహించే నరకాసుర వధ కార్యక్రమానికి ఉత్సవ కమిటీని నియమించబోతున్నట్లు ధర్మ జాగరణ సమితి ఉత్సవ కమిటీ కన్వీనర్ నగరపు రమేష్ తెలిపారు. సోమవారం రోజున ఉదయం 10 గంటలకు ములుగు జిల్లా కేంద్రంలోని బొడ్రాయి వద్ద ఉత్సవ కమిటీ సభ్యులను ప్రత్యక్ష పద్ధతిలో ఏకగ్రీవంగా ఎన్నుకుంటామని ఆయన తెలిపారు.
పార్టీలకతీతంగా నిర్వహించుకునే ఉత్సవ కమిటీ లో భాగస్వాములు కావాలని ఆయన యువతకు పిలుపునిచ్చారు. గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహించుకుంటున్న ఈ ఉత్సవాలను కరోనా తరుణంలో నిర్వహించుకోలేక పోయామని తెలిపారు. ఈ సంవత్సరం నిర్వహించుకునే ఉత్సవంలో పెద్దఎత్తున ప్రజలు పాల్గొనాలని తెలిపారు.