31.2 C
Hyderabad
April 19, 2024 06: 17 AM
Slider వరంగల్

దీపావళి ఉత్సవ నిర్వహణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు చర్యలు

నవంబర్ 4న దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్వహించే నరకాసుర వధ కార్యక్రమానికి ఉత్సవ కమిటీని నియమించబోతున్నట్లు ధర్మ జాగరణ సమితి ఉత్సవ కమిటీ కన్వీనర్ నగరపు రమేష్ తెలిపారు. సోమవారం రోజున ఉదయం 10 గంటలకు ములుగు జిల్లా కేంద్రంలోని బొడ్రాయి వద్ద ఉత్సవ కమిటీ సభ్యులను ప్రత్యక్ష పద్ధతిలో ఏకగ్రీవంగా ఎన్నుకుంటామని ఆయన తెలిపారు.

పార్టీలకతీతంగా నిర్వహించుకునే ఉత్సవ కమిటీ లో భాగస్వాములు కావాలని ఆయన యువతకు పిలుపునిచ్చారు. గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహించుకుంటున్న ఈ ఉత్సవాలను కరోనా తరుణంలో నిర్వహించుకోలేక పోయామని తెలిపారు. ఈ సంవత్సరం నిర్వహించుకునే ఉత్సవంలో పెద్దఎత్తున ప్రజలు పాల్గొనాలని తెలిపారు.

Related posts

సహకార ఎన్నికలలో ఎగిరేది గులాబి జెండానే

Satyam NEWS

హైదరాబాద్ లో ఉన్న నాయకా విశాఖ ఎప్పుడొస్తావు?

Satyam NEWS

నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్ స్టాన్సెస్ చట్టంపై అవగాహన

Satyam NEWS

Leave a Comment