శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కరోనా వైరస్ యొక్క వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం పరిధిలో 17-08-2020 తేదీ నుండి జరగవలసిన డిగ్రీ ఫైనల్ ఇయర్ సెమిస్టర్ వాయిదా వేస్తున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ సి ఎస్ సాయి ప్రసాద్ రెడ్డి తెలిపారు.
నెల్లూరు జిల్లాలో వివిధ పట్టణాల్లో అధికారులు లాక్ డౌన్ ప్రకటించిన నేపధ్యంలో పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. తదుపరి పరీక్షలు నిర్వహించే తేదీలను తరువాత ప్రకటిస్తామని తెలిపారు. ఇతర వివరాలు, పరీక్షల షెడ్యూల్ కోసం విశ్వవిద్యాలయ వెబ్ సైట్ ను సందర్శించాలని సూచించారు.