గుంటూరు జిల్లా నరసరావుపేటలో దారుణం జరిగింది.
డిగ్రీ విద్యార్థిని కోట అనూష (19) దారుణ హత్యకు గురయింది.
ముప్పాళ్ళ మండలం గొల్లపాడు కు చెందిన అనూష నరసరావుపేట పట్టణంలోని కృష్ణవేణి కాలేజీలో డిగ్రీ చదువుతున్నది.
ఈ దారుణ హత్య నరసరావుపేట పట్టణంలో సంచలనం కలిగించింది. ఆ అమ్మాయి వెంటపడి వేధిస్తున్న యువకుడే ఈ హత్య చేశాడని బంధువులు ఆరోపిస్తున్నారు.
అదే కాలేజ్ లో డిగ్రీ చదువుతున్న బొల్లాపల్లి మండలం పమిడిపాడు చెందిన విష్ణువర్ధన్ రెడ్డి ఈ హత్య చేసినట్లు చెబుతున్నారు.
విష్ణువర్ధన్ రెడ్డి అనూష ను గొంతు నులిమి హత్యచేసి పాలపాడు సమీపంలో కాలువలో పడవేశాడు. ఆ తర్వాత అతను నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు.