భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన తెలంగాణ రాష్ట్రంలో సహాయ పునారావాస కార్యక్రమాల కోసం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రూ.15 కోట్ల సాయాన్ని ప్రకటించారు.
కష్ట సమయంలో తెలంగాణ రాష్ట్రానికి ఢిల్లీ పూర్తిగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రూ.15 కోట్ల సాయం ప్రకటించిన ఢిల్లీ ముఖ్యమంత్రికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.
మంగళవారం అరవింద్ కేజ్రీవాల్ కు కేసీఆర్ ఫోన్ చేసి మాట్లాడారు. కేజ్రీవాల్ ఎంతో ఉదారతతో అండగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపారు.