ఢిల్లీ నగర డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ డాక్టర్ జి. రామ్ గోపాల్ నాయక్ నేడు నిర్మల్ జిల్లా లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసర లోని శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా మంగళవారం అమ్మవారిని దర్శించుకున్న ఆయనకు ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
తీర్థ ప్రసాదాలతో బాటు అమ్మవారి ఆశీస్సులను అందించారు. అనంతరం రాం గోపాల్ అమ్మవారిని దర్శించుకుని అన్నదానానికి రూపాయలు 10,116 రూపాయలు విరాళంగా అందించారు.