కడపజిల్లా రాజంపేట సాధన సమితికి మద్ధతు తెలుపుతూ ఆదివారం ఉద్యోగ సంఘాల నేతలు గౌరవ అధ్యక్షుడు ఓజిలి శివారెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. నాలుగు రోజులుగా అన్నమయ్య జిల్లా సాధన కోసం ఆర్ అండ్ బి బంగ్లా వద్ద రిలే నిరాహారదీక్షలు నిర్వహిస్తున్నారు.
రాజంపేటను అన్నమయ్య జిల్లాగా సాధించాలనే ఏకైక సంకల్పంతో అందరూ ముందుకు సాగాలని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఈ దీక్షా కార్యక్రమంలో పాల్గొన్న రాజంపేట ఉద్యోగ సంఘాల కు ఐక్య పోరాట వేదిక చైర్మన్ గుల్జార్ బాషా,బీజేపీ అసెంబ్లీ ఇంచార్జీ పొతుగుంట రమేష్ నాయుడు,జనసేన మహిళా నేత కుసుమ కుమారి తదితరులు పాల్గొని సంఘీభావం ప్రకటించారు.