మంగళగిరి పట్టణంలోని టిప్పర్ల బజార్ లో ప్లాన్ లేకుండా నిర్మాణం జరుగుతున్న అనధికార కట్టడాన్ని పట్టణ ప్రణాళిక విభాగ అధికారి (టిపిఓ) వెంకటేశ్వరరావు సూచన మేరకు గురువారం అధికారులు కూల్చివేయించారు. ప్లాన్ లేకుండా భవనం నిర్మించటమే కాకుండా తొలి అంతస్తు నిర్మిస్తుండగా కూల్చి వేత ద్వారా చర్యలు తీసుకున్నట్లు టిపిఓ తెలిపారు.అనధికార కట్టడాలు నిర్మాణం జరిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు.పట్టణ ప్రణాళికా విభాగ సూపర్ వైజర్ (డిపిఎస్) సుజాత,వార్డు ప్లానింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
అనధికార నిర్మాణాలు, చర్యలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని పలుమార్లు ఏపీ ముఖ్యమంత్రి, ఇతర ఉన్నతాధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. అయినా అనధికార నిర్మాణాలు చోటు చేసుకుంటుడడం గమనార్హం