38.2 C
Hyderabad
April 25, 2024 12: 37 PM
Slider కృష్ణ

బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల..!

#kanakadurgatemple

విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై సదా ఉండాలని రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అభిషించారు.  విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారిని  డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. డిప్యూటీ స్పీకర్ రాక సందర్భంగా ఆలయ అధికారులు పూర్ణకుంభతో స్వాగతం పలికారు. వేద పండితుల మంత్రోచ్చారణ ల డిప్యూటీ స్పీకర్ దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. 

వేద పండితులు ఆశీర్వచనం చేశారు. ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారిణి భ్రమరాంబ  అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు. అమ్మవారిని దర్శించుకున్న వారిలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వెంట కుమార్తె  విజయనగర డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి,అల్లుడు మరియు వైయస్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జిల్లా నాయకులు, జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు జి ఈశ్వర్ కౌశిక్, వైయస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కేదార శెట్టి సీతారామమూర్తి, ఎస్ వి వి రాజేష్, సంఘం రెడ్డి బంగారు నాయుడు, రెడ్డి గురుమూర్తి, కాళ్ల సూరిబాబు, ఆడారి నగేష్, ఆవాల రోహిణి కుమార్, కరణం రమేష్ తదితరులు ఉన్నారు.

Related posts

ఘనంగా ప్రారంభ మైన సాగరమాత మహోత్సవాలు

Satyam NEWS

సుప్రీంకోర్టుకు చేరిన జోషిమఠ్ భూమి కుంగుబాటు అంశం

Bhavani

కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు మందు నీళ్ల స్ప్రే

Satyam NEWS

Leave a Comment