30.7 C
Hyderabad
April 16, 2024 23: 01 PM
Slider చిత్తూరు

తిరుపతి వెంకన్న ను దర్శించుకున్న డిప్యూటీ స్పీకర్

#kolagatla

కలియుగ దైవం… వడ్డీ కాసుల వాడైన తిరుమల ఏడుకొండల వేంకటేశ్వరుడుని ఏపీ డిప్యూటీ స్పీకర్, విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి దర్శించుకున్నారు. తిరుమల… ప్రజలందరికీ శుభాలు కలగాలని, కలియుగ వైకుంఠుడు వెంకటేశ్వరుని ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కోలగట్ల వీరభద్ర స్వామి అభిలాషించారు.

బుధవారం తెల్లవారుజామున కలియుగ వైకుంఠనాథుడు , తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని, ప్రజా రంజక పాలన చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరింత శక్తిని ప్రసాదించాలని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల అభిలాషించారు.

డిప్యూటీ స్పీకర్ వెంట శ్రీనివాసుని దర్శించుకున్న వారిలో శాసనమండలి సభ్యులు డాక్టర్ పి వి సూర్యనారాయణ రాజు, రాష్ట్ర పర్యావరణ పరిరక్షణ బోర్డు చైర్మన్ గుబ్బ చంద్రశేఖర్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కె.వి సూర్యనారాయణ రాజు, ప్రముఖ వ్యాపారవేత్త, కాంట్రాక్టర్ కేఏపీ రాజు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవర్న కుమారస్వామి, విజయనగరం పైడితల్లి అమ్మవారి పాలకమండలి సభ్యులు ఎం కె బి శ్రీను, హర్ష రాజు, నున్న సురేష్, హరి, వాసు, గోపాలకృష్ణ తదితరులు ఉన్నారు.

అనంతరం..తిరుపతి పార్లమెంటు సభ్యులు డాక్టర్ గురుమూర్తి ..రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కోలగట్ల వీరభద్రస్వామి నాడు తిరుమలలో మర్యాదపూర్వకంగా కలిశారు. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ఎంపీ డాక్టర్ గురుమూర్తి పుష్పగుచ్చమిచ్చి, శాలువా కప్పి అభినందనలు తెలియజేశారు. ఇరువురు కాసేపు ఒకరికొకరు యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అభినందన సమయంలో రాష్ట్ర పర్యావరణ పరిరక్షణ బోర్డు చైర్మన్ గుబ్బ చంద్రశేఖర్, శాసన సభ్యులు డాక్టర్ పివి సూర్యనారాయణ రాజు తదితరులు ఉన్నారు.

Related posts

ధాన్యం ఆన్లోడింగ్ కు మిల్లర్ల అంగీకారం

Satyam NEWS

అమెరికాలో 54 వేల మందికి అన్నదానం చేసిన 3 రోజ్ ట్రైబ్

Satyam NEWS

ఘనంగా ప్రారంభ మైన సాగరమాత మహోత్సవాలు

Satyam NEWS

Leave a Comment