32.7 C
Hyderabad
March 29, 2024 12: 16 PM
Slider ఖమ్మం

అభివృధ్ధి పనులను ప్రారంభించిన మంత్రి పువ్వాడ

#puvvada

ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండలంలో పలు గ్రామాల్లో చేపట్టిన 36 పనులకు గాను రూ.1.13 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. మల్లేపల్లి గ్రామంలో 9పనులకు గాను రూ.26.20 లక్షలు, రాములు తండా గ్రామంలో 5 పనులకు గాను రూ.20 లక్షలు, బావోజి తండా గ్రామంలో 11 పనులకు గాను రూ.33 లక్షలు, జింకల్ తండా గ్రామంలో 9 పనులకు గాను రూ.26.10 లక్షలు, పరికలబొడు తండా గ్రామంలో 2 పనులకు గాను రూ.7.75 లక్షలు మొత్తం రూ.1.13 కోట్ల రూపాయల విలువైన సీసీ రోడ్లు, సీసీ కాల్వలను ప్రారంభించారు.ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాథపాలెం మండలంలోనే అత్యధిక నిధులు కేటాయించడం జరిగిందని, కోట్ల రూపాయలు వెచ్చించి ప్రతి గ్రామంలో రోడ్లతో పాటు, ప్రతి గల్లీలో సిసి రోడ్లు వేసి అన్ని సౌకర్యాలు కల్పించామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మలోత్ గౌరీ, నర్సింహా రావు, రామకృష్ణ, ఆదిత్య రాజ్, భాస్కర్, ఆయా గ్రామాల సర్పంచ్ లు, వార్డు సభ్యులు, నాయకులు ఉన్నారు.

Related posts

అమ్మేది ఎవరో తెలియాల్సిందే.. సీసీపీఏ ఆదేశాలు

Sub Editor

హై కోర్టు స్టే ధిక్కరించి రాజంపేటలో పట్టాల పంపిణీ…..

Satyam NEWS

రక్తదాన శిబిరాలను కూడా మూర్ఖులు విమర్శిస్తున్నారు

Satyam NEWS

Leave a Comment