రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని కీలక ప్రాంతంలో ఉన్న అంబిర్ చెరువును త్వరలోనే పూర్తి స్థాయిలో సుందరికరిస్తామని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి శాసన సభ్యుడు అరెకపూడి గాంధీ అన్నారు. నిజాంపేట్ మున్సిపల్ కార్పోరేషన్ 5వ డివిజన్(ప్రగతి నగర్ ) కార్పొరేటర్ చల్ల ఇంద్రజిత్ రెడ్డి నేడు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు.
అంబిర్ చెరువు సుందరీకరణ, సమాంతర రహదారుల అభివృద్ధి తదితర అంశాలను ప్రస్తావించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ అంబిర్ చెరువును సుందర వనంగా తీర్చిద్దిది ప్రజలకు అందుబాటులో కి తీసుకువస్తామని, ఆహ్లదకరమైన వాతావరణం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
అదేవిధంగా ట్రాఫిక్ రద్దీ తగ్గించడానికి ప్రగతి నగర్ నుండి చెరువు కట్ట మీదుగా వయా శంషిగుడా నుండి JNTU ప్రధాన రహదారి వరకు సమాంతర రోడ్డు నిర్మాణాన్ని చేపడతామని ఆయన అన్నారు. తద్వారా ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేని, సుఖఃవంతమైన, మెరుగైన ప్రయాణానికి బాటలు వేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
అదేవిధంగా ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి ప్రజాసమస్యలు పరిష్కరించేలా కృషి చేసి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలని కార్పొరేటర్ కి ఆయన హితవు చెప్పారు.