డివిజన్ లోని అభివృద్ధి నిర్మాణ పనులను త్వరిత గతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని హబ్సిగూడ కార్పొరేటర్ కక్కిరేణి చేతన హరీష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం హబ్సిగూడ పరిధిలోని మధురానగర్ మొయిన్ రోడ్డులో జరుగుతున్న నూతన సీసీ రోడ్డు పనులు, గణేష్ నగర్ కాలనీలో జనని హాస్పిటల్ దగ్గర లైన్లో డ్రైనేజ్ సమస్యలు, కార్పొరేటర్ కక్కిరేణి చేతన హరీష్ , ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ పనులను ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా సకాలంలో పూర్తి చేయాలని, రాబోయే రైనీ సీజన్లో ఇబ్బందులు పునరావృతం కాకుండా యూ జి డి. లైన్లో సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా శ్రీనివాసపురం కమిటీ హాల్లో రిపేర్ వర్క్ లను , కాలనీ రోడ్ ప్యాచ్ వర్క్ లను త్వరగా పరిష్కరించి అందుబాటులోకి తీసుకు రావాలనీ కార్పొరేటర్ అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో ఏఈ. సాయికిరణ్, వర్క్ ఇన్స్పెక్టర్ రమేష్ రాథోడ్, వాటర్ వర్క్స్ ఏఈ రవీందర్, బీజేపి ఓబీసీ కార్యదర్శి శివగౌడ్ ,కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
సత్యంన్యూస్.నెట్, మేడ్చల్ జిల్లా ప్రతినిధి