హుజురాబాద్ పట్టణం లో చేపట్టనున్న అభివృద్ధి పనులను పాలకవర్గం ఏకగ్రీవంగా ఆమోదించిందని మున్సిపల్ చైర్పర్సన్ రాధిక అన్నారు. సోమవారం మున్సిపల్ స్థానిక మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా మున్సిపల్ పరిధిలోని వివిధ అభివృద్ధి పనుల నిర్మాణాలను మున్సిపల్ ఇంజనీర్ చంద్రమౌళి ఎజెండా అంశాలను చదివి వినిపించారు. ఎజెండాలో అంశాలను ప్రతిపాదించగా పాలకవర్గ సభ్యులు అంశాలను ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.