31.2 C
Hyderabad
April 19, 2024 05: 48 AM
Slider మెదక్

పటాన్చెరులో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

#patancheru

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు మండల పరిధిలోని పాశమైలారం పారిశ్రామికవాడ నుండి కర్ధనూరు ఔటర్ రింగ్ రోడ్డు జంక్షన్ వరకు 121 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న నాలుగు వరసల బీటీ రహదారి పనులకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు హాజరయ్యారు.

అనంతరం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు మండల పరిధిలోని రుద్రారం శ్రీ సిద్ది గణపతి దేవాలయం ఆవరణలో నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న మూడు రాజగోపురాలు, నిత్య అన్నదాన సత్రం, కళ్యాణ మండపం, 24 దుకాణాల సముదాయాల నిర్మాణాలకు కూడా మంత్రి శంకుస్థాపన చేశారు.

Related posts

వైభ‌వంగా పద్మావతి అమ్మవారి పంచమీ తీర్థం

Satyam NEWS

సెకండ్ వేవ్ ను ఎట్టిపరిస్థితుల్లో రానివ్వవద్దు

Satyam NEWS

నటరాజ రామకృష్ణ శతజయంతి ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

Satyam NEWS

Leave a Comment