రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వనపర్తి జిల్లా పానుగల్ మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు వేదిక భవన నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు.
ఈ కార్యక్రమాలలో కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్ష వర్ధన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. అదే విధంగా బండపల్లి గ్రామ స్టేజి వద్ద నిర్మించతలపెట్టిన సెగ్రీగేషన్ భవన నిర్మాణానికి కూడా మంత్రి భూమి పూజ చేశారు. అనంతరం బండపల్లి స్టేజి వద్ద బస్ షెల్టర్ ను ప్రారంభించి అక్కడ మంత్రి మొక్కలు నాటారు.