గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం లోని పిడుగురాళ్ల టౌన్ లో ఓవర్ బ్రిడ్జి నిర్మాణం విషయాన్ని ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి నేడు సమీక్షించారు.
అదే విధంగా MRO ఆఫీస్ దగ్గర చేపట్టాల్సిన అభివృద్ధి పై కూడా అధికారులతో కలిసి పర్యవేక్షించారు.
పిడుగురాళ్ల టౌన్ లోని పిల్లుట్ల రోడ్డులో ఉన్న హిందు స్మశాన వాటిక లో సౌకర్యాలు కల్పించడానికి చిన్న చిన్న పనులను పూర్తి చేసి చెట్లను పెంచి గ్రీనరి ఏర్పాటు చేయాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
హిందూ , ముస్లిం , క్రిస్టియన్ లకు స్మశాన వాటికలకు ఆదర్శ కాలనీలో 10 ఎకరాల స్థలాలను చూసి కేటాయించాలని అధికారులకు సూచన ఇచ్చారు.
పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు లేకుండా రోడ్డుకిరువైపులా పార్కింగ్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.