సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీ లోని 21,22వ వార్డు అభివృద్ధి పనులకు టి పిసిసి అధ్యక్షుడు, నల్లగొండ పార్లమెంట్ సభ్యులు నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి తన యంపి నిధులనుండి 20 లక్షల రూపాయలు మంజూరు చేశారు.
ఈ నిధులు స్థానిక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్ రావు చొరవతో యంపి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఒప్పించి మంజూరు చేయించారు. మంజూరైన నిధులతో నాలుగు కల్వర్ట్లు, నాలుగు సిసి రోడ్లు మంజూరుతో హుజూర్ నగర్ పట్టణంలోని 21, 22 వార్డులలో మెరుగైన అభివృద్ధి సాధించవచ్చునని మల్లికార్జున రావు తెలిపారు.