34.2 C
Hyderabad
April 23, 2024 12: 56 PM
Slider మెదక్

అభివృద్ధి పనులు వేగవంతం చేయండి: ఎంపీ కే పి ఆర్

#mpkottaprabhakarreddy

సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజక వర్గంలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దుబ్బాక మండలం పోతారం లో పంచాయతీ రాజ్ ఆర్, అండ్ బి అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఆర్ అండ్ బి శాఖ ద్వారా తోగుట మండలంలోని సిద్దిపేట వెంకటరావుపేట రోడ్డుకు రూ 4 కోట్లు, మెట్టు అల్వాల్ రోడ్డు కు రూ 11 కోట్లు,  లచ్చ పేట బ్రిడ్జి కి రూ 1. 25 కోట్లు మంజూరు చేయించడం జరిగిందన్నారు. దుబ్బాక నియోజకవర్గం లోని గ్రామ పంచాయతీలకు ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన సిసి రోడ్లు యుద్ద ప్రాతిపదికన చేయాలని ఆయన ఆదేశించారు.

టీఆర్ఎస్ క్రియాశీలక సభ్యత్వం పొంది ప్రమాదవశాత్తు మరణించిన దౌల్తాబాడ్ మండలంలోని గాజులపల్లి కి చెందిన లకుడ మైన స్వామి, చేగుంట మండలంలోని పోతాన్ పల్లికి చెందిన కరింగుల శ్రీనివాస్ రెడ్డి, బోనాలకు చెందిన ఛత్రి మల్లేశం, మిర్దోడ్డి మండలంలోని అల్వాల్ కు చెందిన మహమ్మద్ నహీం పాషా కుటుంబాలకు తలా రూ.రెండు లక్షల చొప్పున బీమా పరిహారం చెక్కులను అందించారు.

నియోజకవర్గంలో ని పలువురికి సీఎం సహాయనిది చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్ అండ్ బీ , పీఆర్ డీఈ లు వెంకటేష్, విజయ్ ప్రకాష్, ఏఈ లు రిజ్వాన్, మున్సిపల్ చైర్మన్ గన్నే వనిత భూమిరెడ్డి, సాజిద్, జడ్పీటీసీ కడతల రవీందర్ రెడ్డి, ఎంపీపీ కొత్త పుష్పాలత కిషన్ రెడ్డి, మండలాల పార్టీ అధ్యక్షులు రణం శ్రీనివాస్ గౌడ్, జీడిపల్లి రాంరెడ్డి, నియోజకవర్గంలో ని సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఉద్యోగార్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి!

Satyam NEWS

అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేసిన వైసిపి అభ్యర్థి గురుమూర్తి

Satyam NEWS

11.18 శాతం పెరిగిన పన్ను వసూళ్లు

Bhavani

Leave a Comment