28.7 C
Hyderabad
April 17, 2024 04: 36 AM
Slider ముఖ్యంశాలు

రాజమండ్రి జైలులో దేవినేని ఉమకు ప్రాణ హాని

#achemnaidu

రాజమండ్రి జైలులో మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు ప్రాణహాని ఉందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు శుక్రవారం నాడు ఆందోళన వ్యక్తం చేశారు.

ఆయనకు హానిచేసే ఉద్దేశంతోనే ఆ జైలు సూపరింటెండెంట్‌ను ఆకస్మికంగా మార్చారు అని అచ్చెన్నాయుడు ఆరోపించారు.

దేవినేని ఉమాను రాజమండ్రి జైలుకు తరలించగానే అక్కడి జైలు సూపరింటెండెంట్‌ రాజారావును ఆకస్మికంగా బదిలీ చేసి కిశోర్‌కుమార్‌ అనే అధికారిని నియమించారు.

దేవినేనికి హాని తలపెట్టే ఉద్దేశంతోనే ఈ మార్పు చేశారు. తప్పుడు కేసులు పెట్టి ఉమను జైలుకు పంపింది గాక అక్కడ కూడా ప్రాణహాని తలపెట్టడానికి కుట్రలు చేయడం దారుణం అని ఆయన వ్యాఖ్యానించారు.

జైల్లో ఉన్న ప్రత్యర్థులను హతమార్చిన చరిత్ర వైసీపీ నేతలకు ఉందని ఆయన అన్నారు.

ఉమకు ఎటువంటి హాని జరిగినా దానికి ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాలని అచ్చెన్నాయుడు అన్నారు.

Related posts

నల్లకుంట శంకర మఠంలో లలిత్ ఆదిత్య అష్టావధానం

Satyam NEWS

కరోనా వ్యాధిగ్రస్తులను ఆదుకుంటున్న ఉప్పల చారిటబుల్ ట్రస్ట్

Satyam NEWS

బిందువులం మేమే

Satyam NEWS

Leave a Comment