నిర్మల్ జిల్లా బాసరలో కొలువై ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతీ దేవీ అమ్మవారికి బంగారం, ముత్యాల మిశ్రమ హారాన్ని భక్తులు సమర్పించారు. హైదరాబాద్ విద్యానగర్ కు చెందిన బి.అకోక్ రెడ్డి సతీమణి బి వాసవి ఈ బంగారు ముత్యాల హారాన్ని నేడు అమ్మవారికి సమర్పించారు. ముందుగా వీరికి ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయ పూజారి మదన్ దీక్షిత్ వారిని శాలువతో సన్మానించి అమ్మవారి ప్రసాదాన్ని బహూకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ శరత్ పాఠక్, ఆలయ AO లక్ష్మీ నారాయణ, ఆలయ ఇంచార్జ్ పర్యవేక్షకులు సంజీవ్ రావు, ఆలయ ఇంచార్జ్ శంకర్ శర్మ, బాసర సర్పంచ్ లక్ష్మణ్ రావ్, వైస్ mpp నర్సింగ్ రావు ఉన్నారు.
previous post