కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాలకు భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు క్యూకట్టారు. భక్తుల తాకిడితో శైవక్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి.
ఘట్కేసర్ మండలంలోని పోచారం, కొండాపూర్, ఎదులబాద్, సంస్కృతి టౌన్ షిప్, వెంకటాద్రి టౌన్ షిప్ పలు శివాలయం ఆలయం లో భక్తులు శివుని దర్శించుకున్నారు. శివుని ఆలయంలో దీపాలు పెట్టి మొక్కులు చెల్లించుకున్నారు. అటు శ్రీశైలం, శ్రీకాళహస్తి, వేములవాడ రాజన్నఆలయాలకు భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది.