కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా శుక్రవారం రాత్రి ధ్వజావరోహాణం నిర్వ హించారు. వేదపండితులు ధ్వజస్తంభం వద్దకు వేంచేశారు. అక్కడ గరుడునికి వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా వేదపఠనం చేశారు.
ధ్వజస్తంభం వద్ద ఉన్న గరుడ పటాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా కిందికి దించారు. తర్వాత ఆ పటాన్ని ధ్వజా వరోహణానికి వచ్చిన స్వామివారి పాదల చెంత ఉంచారు. ధ్వజారోహణ ఘట్టంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు శుక్రవారం నిర్వహించిన ధ్వజా వరోహణంతో ముగిశాయి.
ఈ వేడుకలను టీటీడీ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించారు. బ్రహ్మోత్సవాల ల్లో భాగంగా పదో రోజు ఈ కార్యక్రమంను ఆలయ ప్రాంగణంలో వేదపండితులు, టీటీడీ అధికారులు మంగళ వాయిద్యాల నడుమ వేడుకగా నిర్వహించారు.