సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామంలోని శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానంలో మంగళవారం ధనుర్మాస 27వ,రోజు సందర్భంగా కూడారై ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.
ఉదయం 5 గంటల నుండి ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చన,సేవాకాలం, మంగళాశాసనం,పల్లకి సేవ అనంతరం కూడారై ఉత్సవానికి సంబంధించి మలికంటి జానకి రాములు ధర్మపత్ని సునీత స్వామివారికి 108 గంగాళాలతో క్షీరాన్న ప్రసాదం సమర్పించారు. భక్తులకు తీర్థ ప్రసాద వినియోగం చేశారు.
ఈ సేవా కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ యల్లావుల పిచ్చయ్య,ధర్మ కర్తలు,గ్రామ సర్పంచ్ జోగు సరోజనమ్మ, ఆలయ మేనేజర్ మృత్యుంజయ శాస్త్రి, గ్రామ పెద్దలు,అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్