28.7 C
Hyderabad
April 20, 2024 08: 31 AM
Slider ఆధ్యాత్మికం

ధనుర్మాస సేవా కాలంలో వైభవంగా ‘కూడారై’ ఉత్సవం

#dhanurmasam

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామంలోని శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానంలో మంగళవారం ధనుర్మాస 27వ,రోజు సందర్భంగా కూడారై ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.

ఉదయం 5 గంటల నుండి ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చన,సేవాకాలం, మంగళాశాసనం,పల్లకి సేవ అనంతరం కూడారై ఉత్సవానికి సంబంధించి  మలికంటి జానకి రాములు ధర్మపత్ని సునీత స్వామివారికి 108 గంగాళాలతో క్షీరాన్న ప్రసాదం సమర్పించారు. భక్తులకు తీర్థ ప్రసాద వినియోగం చేశారు.

ఈ సేవా కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ యల్లావుల పిచ్చయ్య,ధర్మ కర్తలు,గ్రామ సర్పంచ్ జోగు సరోజనమ్మ, ఆలయ మేనేజర్ మృత్యుంజయ శాస్త్రి,  గ్రామ పెద్దలు,అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్

Satyam NEWS

క‌న్యకాప‌ర‌మేశ్వ‌రి స‌న్నిధిలో నారాయ‌ణ‌

Satyam NEWS

ఒక యువకుడ్ని నరికి చంపిన అగంతకులు

Satyam NEWS

Leave a Comment