33.2 C
Hyderabad
April 26, 2024 01: 39 AM
Slider వరంగల్

రైతుల పట్ల శాపంగా మారిన ధరణి పోర్టల్ రద్దు చేయాలి

#Dharaniporta

ధరణి పోర్టల్ రద్దు చేయాలని, పోడు భూముల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ములుగు జిల్లా కేంద్రంలోని డి ఎల్ ఆర్ గార్డెన్ నుండి ఎడ్ల బండ్లు,ట్రాక్టర్లతో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క హాజరయ్యారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ రాష్ట్రం లో రైతుల పడుతున్న కష్టాలు అంత ఇంత కాదని ధరణి పోర్టల్ తెచ్చి రైతులను మోసం చేస్తున్నారని అన్నారు. ధరణి పోర్టల్ నిర్వహిస్తున్నది ప్రభుత్వం కాదు…ప్రజల ఆస్తుల వివరాలను ప్రయివేటు కంపెనీలకు దారాదత్తం చేశారు…అని అన్నారు. వ్యక్తుల ఆస్తుల వివరాల సమాచారం రహస్యంగా ఉంచాలి. కానీ ప్రయివేటు వ్యక్తులకు, కంపెనీలకు చేతుల్లోకి వెళ్లి దుర్వినియోగం అవుతోంది.

భూములు ఉన్న ప్రతి ఒక్కరు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. ధరణితో రాష్ట్ర ప్రభుత్వం రైతుల పొట్ట కొడుతోంది. ప్రభుత్వం తక్షణమే రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం అని అన్నారు. పోడు భూముల పట్టాలు ఇవ్వకుండా కమిటీలతో ప్రభుత్వం కాలయాపన చేస్తోంది అటవీ హక్కుల చట్టం ప్రకారం పోడు భూములకు పట్టాలివ్వాలి పోడు భూములకు పట్టాలు ఇచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది అని సీతక్క అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి, టిపిసిసి అధికార ప్రతినిధి కుచన రవళి రెడ్డి, టిపిసిసి కార్యదర్శి పైడాకుల అశోక్, చల్ల నారాయణ రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లాడి రాం రెడ్డి,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్ ఫిషర్ మెన్ జిల్లా అధ్యక్షులు కంబాల రవి,ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి సుధాకర్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు గుమ్మడి సోమయ్య,మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు అయుబ్ ఖాన్,మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కొమురం ధన లక్ష్మి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బై రెడ్డి బాగ్ వాన్ రెడ్డి, ఇరుస వడ్ల వెంకన్న,ఎన్ ఎస్ యు ఐ మామిడి శెట్టి కోటి కాంగ్రెస్ పార్టీ ములుగు మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా, చెన్నోజు సూర్య నారాయణ,చిట మట రఘు జాలపు అనంత రెడ్డి,ఎండీ అఫ్సర్,

వజ్జా సారయ్య, సుంకర బోయిన మొగిలి వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఆకు తోట చంద్ర మౌళి,బండి శ్రీనివాస్,రసు పుత్ సీతారాం నాయక్,జెడ్పీటీసీ నామా కరం చంద్ గాంధీ,పుల్సం పుష్ప లత శ్రీనివాస్,ఎంపీపీ విజయ రూపు సింగ్,తాడ్వాయి మండల వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ముదర కోళ్ల తిరుపతి,కాంగ్రెస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు పూజారి సురేందర్ బాబు,ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర,జిల్లా,మండల అనుబంధ సంఘాల అధ్యక్షులు సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ కమిటీ అధ్యక్షులు జిల్లా మండల గ్రామ సీనియర్ నాయకులు యువజన కాంగ్రెస్ జిల్లా మండల నాయకులు మహిళా కాంగ్రెస్ జిల్లా మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

యుద్ధ విమాన టైరును దొంగలించిన దుండగులు

Sub Editor

విపత్కర పరిస్థితులలో కూడా సంక్షేమ పథకాలు ఆగవు

Satyam NEWS

నవ వసంతం

Satyam NEWS

Leave a Comment