Slider ముఖ్యంశాలు

ఏపీపీఎస్సీ అక్రమాల కేసులో ధాత్రి మధు అరెస్టు

#DhatriMadhu

ఏపీపీఎస్సీ (APPSC) గ్రూప్‌-1 అక్రమాల కేసులో ధాత్రి మధును పోలీసులు అరెస్టు చేశారు. ‘క్యామ్‌సైన్‌ మీడియా’ సంస్థకు అతడు డైరెక్టర్‌గా ఉన్నాడు. ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌ జవాబుపత్రాల మూల్యాంకనంలో అక్రమాలకు పాల్పడ్డారని అతడిపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో హైదరాబాద్‌లోని అతడి కార్యాలయంలో మధును ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం విజయవాడకు తరలిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌లో ‘క్యామ్‌సైన్‌ మీడియా’ సంస్థ ప్రతినిధి పేరును ఏ2గా చేర్చారు. నిబంధనలకు విరుద్ధంగా.. కొటేషన్‌ విధానంలో మూల్యాంకన బాధ్యతలు పొందిన సదరు సంస్థ అవకతవకలకు పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ వ్యవహారంలో విజయవాడలోని సూర్యారావుపేట పోలీసు స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో సీనియర్‌ ఐపీఎస్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులును ఇప్పటికే ఏ1గా చేర్చిన విషయం తెలిసిందే.

Related posts

అల్లూరి సీతారామరాజు సేవలు చిరస్మరణీయం

Satyam NEWS

ఉత్తరాంధ్ర వాణి ని వినిపిద్దాం…రండి: వైఎస్సార్సీపీ

Satyam NEWS

నూతన సంవత్సరం సందర్భంగా గ్రామాలలో అశ్లీల నృత్యాలు

Satyam NEWS
error: Content is protected !!