ప్రతిపక్షాలకు శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు కూడా లేదా? అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్.శ్రీనివాస రెడ్డి ప్రశ్నించారు.
రాష్ట్రంలో జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నదని ఆయన అన్నారు.
రేణిగుంట ఎయిర్ పోర్టులో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్. చంద్రబాబును అడ్డుకొని, ఎయిర్ పోర్ట్ అంతా దిగ్బంధం చేయడం దారుణం అని ఆయన అన్నారు.
14 సంవత్సరాల ముఖ్యమంత్రి గా ఉన్న వ్యక్తితో పోలీసులు ఈ విధంగా వ్యవహరించడం దారుణమని ఆయన అన్నారు.
మధ్యాహ్నం నీళ్లు లేక ,అన్నం లేక ఒక ప్రతి పక్ష నాయకుడిని అడ్డుకోవడం ఈ ప్రభుత్వ నీచపు చర్యని అన్నారు.