బాలీవుడ్ సినీనట ఆరాధ్య దైవం దిలీప్ కుమార్ (97) (యూసుఫ్ ఖాన్) ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు ఆమె భార్య సైరాభాను (సినీ నటీ) పేర్కొంది. ఈయన పాకిస్థాన్లోని పేషావర్లో 1922లో జన్మించి తదనంతరం పరిణామాల నేపథ్యంలో భారత్కు వచ్చి సినీనటుడిగా ప్రఖ్యాతి గాంచారు. రాజ్కపూర్ కుటుంబంతో సన్నిహిత సంబంధంతో సినీ లోకంలోకి అడుగిడారు.
ఆయన ఆరోగ్యంగా గురించి సైరాబాను ప్రకటించిన విషయాన్నితెలుసుకున్నదిలీప్ కుమార్ అభిమానులు కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆది నుంచి అనేక సినిమాల్లో నటిస్తూ మానవ జీవితానికి సంబంధించి అత్యంత దగ్గరగా, నిజ రూపం దర్శనమిచ్చేలా నటించి నటుడు, దర్శకుడు, నిర్మాత ఆరోగ్యంపై ఆందోళనలో ఉన్నారు. కాగా దిలీప్ కుమార్ నటనకు గాను కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు, ప్రైవేటు సంస్థలు ఇప్పటికే అనేక బిరుదులు ప్రదానం చేశాయి. 1944లో సినీ రంగంలో ప్రవేశించిన దిలీప్ కుమార్ సైరాభానుతో వివాహం చేసుకున్నారు. ఇటీవలే కొద్దికాలం క్రితం ఇద్దరు సోదరులు అనారోగ్యం పాలై చనిపోయారు. దీంతో దిలీప్ కుమార్ కూడా అప్పటి నుంచి కాస్త అన్యమనస్కంగానే ఉంటున్నట్లు సైరాభాను తెలిపారు. తన చిరకాల స్నేహితుడు, శ్రేయోభిలాషి (భర్త)కు సేవలు చేయడం తన అద్రుష్టమని తెలిపారు. ఆయనే ఏ పరిస్థితుల్లోఉన్నవెన్నంటే ఉండడం, ఆయనకు సేవలు చేయడం తన మొదటి ప్రాధాన్యత అని ఆమె వివరించారు. ఆయన ఆరోగ్యం బాగుపడాలని అభిమానులు, శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు.