39.2 C
Hyderabad
April 18, 2024 16: 36 PM
Slider విశాఖపట్నం

విశాఖ జిల్లా శనివాడలో బాలిక అదృశ్యం: ఆపై మృతదేహం లభ్యం

#vizag

విశాఖ నగర శివారు శనివాడలో నిన్న సాయంత్రం కనిపించకుండా పోయిన 13 ఏళ్ల బాలిక మృతదేహం ఈ రోజు తెల్లవారుజామున కనిపించింది. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం బైరెడ్డి పెట్ట  ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం ఉపాధి కోసం విశాఖ వలస వచ్చింది.

కూర్మన్నపాలెం శనివాడ వద్ద ఆదిత్య అపార్ట్ మెంట్ లో అతను వాచ్ మెన్ గా చేరాడు. వారి కుమార్తె పదమూడేళ్ల కీర్తన నిన్న సాయంత్రం నుంచి కనిపించలేదు. కుటుంబ సభ్యులు వేరువేరు ప్రాంతాల్లో వెదికారు. అయితే ఈరోజు తెల్లవారుజామున పక్క అపార్ట్ మెంట్ వద్ద ఆమె మృతదేహం కనిపించింది. ఎవరైనా హత్య చేసి ఉంటారని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. మృతదేహం అక్కడి నుంచి తీయకుండా ఆందోళన బాట పట్టారు.

Related posts

మఠంపల్లి లో ఘనంగా మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు

Satyam NEWS

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ బాధిత రైతులకు అండగా సత్యం న్యూస్

Satyam NEWS

మలేరియా నియంత్రణ దిశగా జాగ్రత్త చర్యలు

Satyam NEWS

Leave a Comment